9, జులై 2010, శుక్రవారం

మనసులో మాటకు ‘వేదిక’


మనసులో మాట చెప్పుకోడానికి వెలుస్తున్న సోషల్‌నెట్‌వర్క్ సైట్లు దిదిన ప్రవర్ధమానం అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తమ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దేంకు వివిధ వెబ్‌సైట్లు కృషి చేస్తున్నాయి. సోషల్‌నెట్‌వర్క్ సర్వీసులను అందించే వెబ్‌సైట్లలో చాలా కాలంగా ఎన్నో వెలుస్తున్నా అత్యంత ఆదరణ చూరగొన్నదిగా ఫేస్‌బుక్‌కు గుర్తింపు వచ్చింది. చాలా మందికి తెలిసిన ఫేస్‌బుక్, ఆర్కుట్, ట్విట్టర్, మైస్పేస్, లింక్‌డిన్ తమ తమ వాటాదారులను సంపాదించుకుంటున్నాయి. సోషల్‌నెట్‌వర్క్‌లో అన్నింటికన్నా ఫేస్‌బుక్ వినియోగదారుల మన్ననలు అందుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఆర్కుట్‌వైపు మొగ్గు చూపేవారు క్రమంగా వారు ఫేస్‌బుక్‌వైపు తమ చూపులు మరలుస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ నెట్‌వర్క్ అందిస్తున్న వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్, మై స్పేస్, ట్విట్టర్, లింక్‌డిన్, నింగ్, టాగ్, క్లాసమేట్స్, హి 5, మై ఇయర్‌బుక్, మీట్ ఆప్, బీబో, మై లైఫ్, ఫ్రెండ్స్‌టర్, మైహెరిటేజ్, మల్టీఫ్లై, ఆర్కుట్, బాదో, గయా ఆన్‌లైన్, బాక్ ప్లానెట్ స్కైరాక్ తదితరాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించుకోడానికి ఏర్పాటు చేసిన వెబ్‌పేజీ ప్రాథమిక నమూనానే క్రమంగా సోషల్‌నెట్‌వర్క్ ఏర్పాటుకు మూలం అయింది. ఈ సంవత్సరం ప్రథమార్థానికి సుమారు 25 కోట్ల మంది వినియోగదారులు ప్రతినెల తమ సైటును సందర్శిస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా మైస్పేస్‌ను 12 కోట్ల 20 లక్షల మంది, ట్విట్టర్‌ను ఎనిమిది కోట్ల ఐదు లక్షల మంది, లింక్‌టిన్ ఐదుకోట్ల మంది, ఆర్కుట్‌ను 4కోట్ల 50లక్షల మంది ప్రతినెలా తమ సైటును సందర్శిస్తున్నవారిలో ఉన్నారు. ఎప్పటిక్పుడు వినియోగదారులు తాము ఏర్పాటు చేసుకున్న సోషల్‌నెట్‌వర్క్‌లోని సైటను నెలలో ఎన్నిమార్లు సందిర్శిస్తున్నారన్న ప్రాతిపదికపై సర్వే నిర్వహించారు. హిట్టింగ్‌రేట్‌కు అనుగుణంగా ఫేస్‌బుక్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంతమంది వినియోగదారులు ఉన్నారని కాదు. ఎంతమంది వినియోగదారులు సమర్థవంతంగా సైటును ఉపయోగించగలుగుతున్నారన్న ప్రాతిపదికపేనే సోషల్‌నెట్‌వర్క్ మనుగడ ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా కొత్తగా ఇమెయిల్ ఐడి (వెబ్‌చిరునామా) ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆయా చిరుమానామా నమోదు చేసిన సైటుకు సంబంధించి సోషల్‌నెట్‌వర్క్ ఖాతా పై మీకు మక్కువ ఉందా? ఉంటే ప్రారంభించండి అంటూ సందేశం కనిపిస్తుంది. ఆదిలో తమకంటూ సోషల్‌నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా సదరు సైటులో ఇప్పటికే నమోదు అయినవారు పరిచయం చేస్తేకానీ సోషల్‌నెట్‌వర్క్‌లోకి సభ్యత్వ లభించేది కాదు. భారదేశంలోని ఎక్కువ మంది వినియోగదారలు ఆర్కుట్‌పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అది ఇప్పుడు క్రమంగా ఫేస్‌బుక్‌వైపు వారి చూపులు మరలాయి. సోషల్‌నెట్‌వర్క్ సైట్లు వివాదం అయిన తరువాతనే ప్రచారంలోకి వచ్చాయి. ఆర్కుట్‌లో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సైటులో తొంగి చూసి స్నేహం చేయడంవల్ల తొలుత ప్రచారం చోటు చేసుకుంది. ఆర్కుట్‌లో స్నేహం చేసినవారిలో ఎక్కువ మంది యువతీ యువకులు వివాహాల వరకు వెళ్ళిన వారు ఉన్నారు. వివాదాలు కొనితెచ్చుకున్నవారు ఉన్నారు. దాపరికంలేకుండా మనసులో మాటచెప్పడమేకాదు కళ్లకు కట్టిట్టు చూపడంవల్ల ఫేస్‌బుక్ ఎక్కువ ఆదరణ చూరగొన్నది. ప్రముఖులు ఫేస్‌బుక్‌లో వెల్లడించిన తమ జీవితరహస్యాల వల్ల ఎందరో వివాదాల పాలు అయిన సందర్భాలు ఉన్నాయి. మనసులో మాట చెప్పాంటే ఇది వేదిక అయింది. ఈ వేదిక మీద చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తాయి. ఆత్మీయుల గుండెతలుపులను తడుతాయి. సోషల్‌నెట్‌వర్క్‌లో చాలా మంది ఖాతా తెరుస్తారు కానీ, అప్‌డేట్ చేయడానికి ముందుకు రారు. ఇలా నిరర్థంగా ఉన్న సోషల్‌నెట్‌వర్క్ చిరునామాలు ఒక్కో సైటులో 60 శాతంపైగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఫేస్‌బుక్, ఆర్కుట్ సోషల్‌నెట్‌వర్క్‌పైన ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అసలు ఈ సైట్లవైపు వినియోగదారులు ఎందుకు మక్కువచూపుతున్నారో పరిశీలిస్తే సులభంగా వెబ్‌పేజీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అన్ని విషయాలు అప్‌డేట్ చేయడంవరకు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో సైటు డిజైన్, వేగం, రిలవెన్సీ, కొత్త అప్లికేషన్లు, స్నేహితులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఫొటోలు, వీడియోలు, నోటిఫికేషన్లు, చాట్ తదితరాలుకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాధాన్యత ఇచ్చేక్రమంలో ప్రాంతీయ భాషలో వినియోగదారుడు తమ అభిప్రాయం చెప్పగలగడం అగ్రస్థానాన నిలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి