స్ఫూర్తి ప్రదాత మన పెదజీయర్
ప్రాచీన ధార్మిక సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా, భగవంతుడు స్వయంగా తన భక్తులను ఈ ప్రపంచానికి పరమ భాగవతోత్తములుగా పంపుతాడు. వంద సంవత్సల క్రితం విదేశీ పాలనలో మన సంప్రదాయాలకు గ్రహణం పట్టింది. ఆ తరుణంలో తిరిగి మన సంప్రదాయాన్ని పురుజ్జీవింప జేయడానికి బాటలు వేసిన ఆచార్యులు మనపెద్దజీయరు స్వామి. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీ వారి తిరునక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని వారి జీవన గమనంలో నూతనోత్తేజం కలిగించిన అంశాలను మననం చేసుకోడం మన బాధ్యత.
ఆచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీ దివ్య రూపంలో శ్రీ రామానుజుల చైతన్యం నింపే స్ఫూర్తి మరియు ఆదర్శం కనిపిస్తాయి. నాడు శ్రీ రామానుజులు స్వయంగా సమాజ ఉద్ధరణకోసం అడుగులు వేసిన విధంగా పెద్ద జీయర్ స్వామీ మార్గనిర్దేశకత్వం చేశారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉద్యమ స్పూర్తికి శ్రీకారం చుట్టారు.
సమాజంలో ప్రజలకు శాంతి, శ్రేయస్సు కొరకు అనేక యజ్ఞాలను నిర్వహించి ఒక స్ఫూర్తి సందేశాలను మనకు పెద్ద జీయర్ స్వామీ అందించారు. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి స్వామీజీ అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యూఢల్లీిలోని రామ్లీలా మైదానంలో 1973లో అఖిల భారత వేద సదస్సును నిర్వహించారు. స్వాతంత్య్రానంతరం నిర్వహించి ఈ సదస్సు ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే సదస్సులో కేవలం పదిహేను నిముషాలు హాజరవుతానని వచ్చిన అప్పటి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సంప్రదాయాలు మరియు సంస్కృతి వైభవాన్ని కాపాడడంలో పెద్ద జీయర్ స్వామీ చేసిన కృషిని ప్రశంసిస్తూ, వారి కార్యకలాపాలను కొనియాడుతూ సదస్సులో రెండు గంటలు గడిపారు. సదస్సుకు వేల సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. మచ్చుకు ఇది ఒక్క సంఘటనే ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అద్భుత విషయాలు గోచరిస్తాయి.
కాకినాడలో 1909 సెప్టెంబర్ 1 న శ్రీ వంగిపురం మంగయ్యార్య, చూడాంబ దంపతులకు పెద్దజియర్ స్వామి జన్మించారు. నామకరణం కాని పసిబాలుడి రక్షణకు ఆదిశేషుడే దిగివచ్చాడు. ఆనాటి సంఘటనతో వారికి 'తిరువెంగళాచార్యులు' అని నామకరణం చేశారు. సంస్కృతం, తార్క, న్యాయ, వేదాంతాలను అధ్యయనం చేస్తున్న సమయంలోనే వారు శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారిని కలిసారు. తమిళ ప్రబంధం శ్రీ గోపాలాచార్య నుండి నేర్చుకున్నారు. గాంధీజీ పిలుపునకు ఆకర్షితులయిన శ్రీమన్నారాయణ స్వాతంత్య్ర ఉద్యమంలో 1920లో పాల్గొన్నారు.
1954 సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని స్వీరించారు. 1954 సంవత్సరం జూన్ 12న బద్రీనాథ్ వద్ద ఆశ్రమం ప్రారంభించారు. వేద సంప్రదాయాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యాంతో ఆచార్య, శ్రీమాన్ గోపాలచార్య స్వామితో కలిసి పనిచేయాలని సంకల్పించుకున్నారు. తోలుత వారు దక్షిణ భారతంలో శ్రీవైష్ణవంపై దృష్టి సారించారు. విశిష్టాద్వైత విలువలను పునరుద్ధరించడానికి వారు కృషి చేశారు. విశిష్టాద్వైత ప్రచారక సంఘానికి శ్రీ గోపాలచార్య స్వామి అధ్యక్షులు కాగా కార్యదర్శిగా శ్రీమన్నారాయణచార్య సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తమిళనాట రామాపచారము జరిగినప్పుడు ప్రాచీన సంస్కృతిని కాపాడటంలో భాగంగా సుమారు మూడు వందల మంది పండితులతో తమిళనాడుకు శ్రీరామాయణ పారాయణం చేపట్టి చరిత్రను సృష్టించారు. భక్తులతో రామకోటి రాయించి శ్రీరామ భక్తిని ప్రబంజనంలా చాటారు. ఆసేతు హిమాచలం నేపాల్ నుంచి కన్యాకుమారివరకు 108 ప్రదేశాలలో శ్రీ రామ స్థూపాలు ప్రతిష్టించారు. శ్రీమాన్ టి.కె. గోపాలాచార్య స్వామి సంపాదకత్వంలో శ్రీమన్నారాయణచార్య ఆధ్యాత్మిక మాస పత్రిక భక్తినివేదన 1947లో ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి కేంద్రాలయిన ఆలయాలపై దృష్టి సారించారు. భారతీయ దేవాలయాల పునరుద్ధరణకు ముంబైలో 1974లో సంఘాన్ని ప్రారంభించారు. ఇలా ఆలయాలకు పూర్వవైభవానికి ముందుకు వచ్చారు. ఇది ఇలా ఉంటే బద్రీనాథ్ వద్ద కోటి అష్టాక్షరి క్రతువు చేపట్టారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ చేసి మార్గదర్శకులైన పెద్ద జీయర్ స్వామి తరువాతి తరానికి చిన్న జీయర్ స్వామిని మనకు అనుగ్రహించి ధన్యులను చేశారు.
`వొద్దిపర్తి రామచందమ్రూర్తి
--
ప్రాచీన ధార్మిక సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా, భగవంతుడు స్వయంగా తన భక్తులను ఈ ప్రపంచానికి పరమ భాగవతోత్తములుగా పంపుతాడు. వంద సంవత్సల క్రితం విదేశీ పాలనలో మన సంప్రదాయాలకు గ్రహణం పట్టింది. ఆ తరుణంలో తిరిగి మన సంప్రదాయాన్ని పురుజ్జీవింప జేయడానికి బాటలు వేసిన ఆచార్యులు మనపెద్దజీయరు స్వామి. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీ వారి తిరునక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని వారి జీవన గమనంలో నూతనోత్తేజం కలిగించిన అంశాలను మననం చేసుకోడం మన బాధ్యత.
ఆచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీ దివ్య రూపంలో శ్రీ రామానుజుల చైతన్యం నింపే స్ఫూర్తి మరియు ఆదర్శం కనిపిస్తాయి. నాడు శ్రీ రామానుజులు స్వయంగా సమాజ ఉద్ధరణకోసం అడుగులు వేసిన విధంగా పెద్ద జీయర్ స్వామీ మార్గనిర్దేశకత్వం చేశారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉద్యమ స్పూర్తికి శ్రీకారం చుట్టారు.
సమాజంలో ప్రజలకు శాంతి, శ్రేయస్సు కొరకు అనేక యజ్ఞాలను నిర్వహించి ఒక స్ఫూర్తి సందేశాలను మనకు పెద్ద జీయర్ స్వామీ అందించారు. ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి స్వామీజీ అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. న్యూఢల్లీిలోని రామ్లీలా మైదానంలో 1973లో అఖిల భారత వేద సదస్సును నిర్వహించారు. స్వాతంత్య్రానంతరం నిర్వహించి ఈ సదస్సు ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే సదస్సులో కేవలం పదిహేను నిముషాలు హాజరవుతానని వచ్చిన అప్పటి మన దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సంప్రదాయాలు మరియు సంస్కృతి వైభవాన్ని కాపాడడంలో పెద్ద జీయర్ స్వామీ చేసిన కృషిని ప్రశంసిస్తూ, వారి కార్యకలాపాలను కొనియాడుతూ సదస్సులో రెండు గంటలు గడిపారు. సదస్సుకు వేల సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. మచ్చుకు ఇది ఒక్క సంఘటనే ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో అద్భుత విషయాలు గోచరిస్తాయి.
కాకినాడలో 1909 సెప్టెంబర్ 1 న శ్రీ వంగిపురం మంగయ్యార్య, చూడాంబ దంపతులకు పెద్దజియర్ స్వామి జన్మించారు. నామకరణం కాని పసిబాలుడి రక్షణకు ఆదిశేషుడే దిగివచ్చాడు. ఆనాటి సంఘటనతో వారికి 'తిరువెంగళాచార్యులు' అని నామకరణం చేశారు. సంస్కృతం, తార్క, న్యాయ, వేదాంతాలను అధ్యయనం చేస్తున్న సమయంలోనే వారు శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారిని కలిసారు. తమిళ ప్రబంధం శ్రీ గోపాలాచార్య నుండి నేర్చుకున్నారు. గాంధీజీ పిలుపునకు ఆకర్షితులయిన శ్రీమన్నారాయణ స్వాతంత్య్ర ఉద్యమంలో 1920లో పాల్గొన్నారు.
1954 సంవత్సరంలో సన్యాసాశ్రమాన్ని స్వీరించారు. 1954 సంవత్సరం జూన్ 12న బద్రీనాథ్ వద్ద ఆశ్రమం ప్రారంభించారు. వేద సంప్రదాయాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యాంతో ఆచార్య, శ్రీమాన్ గోపాలచార్య స్వామితో కలిసి పనిచేయాలని సంకల్పించుకున్నారు. తోలుత వారు దక్షిణ భారతంలో శ్రీవైష్ణవంపై దృష్టి సారించారు. విశిష్టాద్వైత విలువలను పునరుద్ధరించడానికి వారు కృషి చేశారు. విశిష్టాద్వైత ప్రచారక సంఘానికి శ్రీ గోపాలచార్య స్వామి అధ్యక్షులు కాగా కార్యదర్శిగా శ్రీమన్నారాయణచార్య సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తమిళనాట రామాపచారము జరిగినప్పుడు ప్రాచీన సంస్కృతిని కాపాడటంలో భాగంగా సుమారు మూడు వందల మంది పండితులతో తమిళనాడుకు శ్రీరామాయణ పారాయణం చేపట్టి చరిత్రను సృష్టించారు. భక్తులతో రామకోటి రాయించి శ్రీరామ భక్తిని ప్రబంజనంలా చాటారు. ఆసేతు హిమాచలం నేపాల్ నుంచి కన్యాకుమారివరకు 108 ప్రదేశాలలో శ్రీ రామ స్థూపాలు ప్రతిష్టించారు. శ్రీమాన్ టి.కె. గోపాలాచార్య స్వామి సంపాదకత్వంలో శ్రీమన్నారాయణచార్య ఆధ్యాత్మిక మాస పత్రిక భక్తినివేదన 1947లో ప్రారంభించారు. భారతీయ సంస్కృతికి కేంద్రాలయిన ఆలయాలపై దృష్టి సారించారు. భారతీయ దేవాలయాల పునరుద్ధరణకు ముంబైలో 1974లో సంఘాన్ని ప్రారంభించారు. ఇలా ఆలయాలకు పూర్వవైభవానికి ముందుకు వచ్చారు. ఇది ఇలా ఉంటే బద్రీనాథ్ వద్ద కోటి అష్టాక్షరి క్రతువు చేపట్టారు.
ఇలా ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ చేసి మార్గదర్శకులైన పెద్ద జీయర్ స్వామి తరువాతి తరానికి చిన్న జీయర్ స్వామిని మనకు అనుగ్రహించి ధన్యులను చేశారు.
`వొద్దిపర్తి రామచందమ్రూర్తి
--
V.Ramachandra Murthy, 9963895914, USA 001 732 328 8552