21, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఐటి కెరీర్‌కు ఇక ఢోకా లేదు

ఐటి కెరీర్‌కు ఇక ఢోకా లేదు

భారత దేశంలో ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల నియామకాలకు గత రెండు నెలల క్రితమే వివిధ కంపెనీలు శ్రీకారం చుట్టగా ఈ సంవత్సరంలో సుమారు 50వేల మందిని మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించే దశలో ప్రధాన ఐటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం మళ్లీ క్యాంపస్ ఇంటర్య్వూల పేర తమ ద్వారాలు తెరిచాయి. ఈ నేపధ్యంలో ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో తదితర కంపెనీలు కళాశాలలో క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించే దిశగా పను ప్రారంభించినట్లు భోగట్టా. ఐటి రంగంలో మానవ వనరులను ప్రోత్సహించి వారికి ప్రయోజనాలు అందించే దిశలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందుగా శిక్షణ నిచ్చే పనులను ప్రారంభించింది. క్యాంపస్ ఇంటర్య్వూలలో వివిధ కంపెనీలకు సిఎస్‌ఐ చేదోడుగా ఉంటున్న విషయం విధితమే. ఇది ఇలా ఉండగా వచ్చే మూడు నెలలలోటిసిఎస్ సుమారు 30 వేల మందిని ఉద్యోగాలలో తీసుకోనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. 30 వేల మందిలో కొత్తవారికి 70 శాతం వరకు అవకాశం కల్పిస్తామని అదే విధంగా అనుభవం ఉన్న వారిని 30 శాతం వరకు ఎంపిక చేస్తామి కూడా టిసిఎస్ తెలుపుతోంది. ఇది ఇలా ఉంటే కొత్తవారి ఎంపిక కంటే గత సంవత్సరంగా ఖాళీ ఉన్న వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే దిశలో ప్రముఖ కంపెనీలు ముందుకు వెళుతున్నాయి. అయితే పట్టాతీసుకున్న తరువాత గడిపిన కాలంలో వారు ఏమి చేశారనే విషయంపైననే వౌఖిక ఇంటర్వ్యూలలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కెరీర్‌కు చాలా కాలంగా దూరం ఉన్నవారు నడుచుకున్న నడవడికపైన వారి ఆలోచన, తీరు తెన్నులు ఆధారపడుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. విప్రోసుమారు పదివేల మందికి అవకాశం కల్పించ నుండగా, మైక్రోసాఫ్ట్ ఒకడుగు ముందుకు వేసి హైదరాబాద్ క్యాంపస్‌లోని సుమారు 15 వేల మంది మానవవనరులకు అవకాశం కల్పించనున్నది. అంతే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల తగు ప్రాధాన్యత కల్పిచడానికి వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కేవలం ఈ పురోభివృద్ధి సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాలేదు. హార్డ్ వేర్ రంగంలో నిపుణులకు అవకాశాలు గుమ్మం తడుతున్నాయి. హెచ్‌సిఎల్, రాక్‌వెల్ కలిన్స్, జియోమెట్రిక్, సీమెన్స్, హనీవెల్, టాటా, టెక్ మహీంద్రా, హెగ్జావేర్ టెక్నాలజీస్ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించ నున్నట్లు ఆయా వెబ్‌సైట్లలో తెలుపుతున్నాయి. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వివరాలు క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించనున్న కళాశాలలకు పంపినట్లు భోగట్టా. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి పరిశ్రమల పురోగతి అధికంగా ఉంటుందని, దేశీయంగా 17 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశం ఉందని నాస్‌కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వెల్లడించారు. అవుట్‌సోర్సింగ్‌పై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని దేశీయ ఐటి కంపెనీలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా ఇప్పడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మరింత మెరగుపడుతుందని నాస్‌కామ్ చైర్మన్ ప్రమోద్ భాసిన్ చెప్పారు. దేశంలో ఐటి రంగంలో జరుగుతున్న అభివృద్ధిని నాస్‌కామ్ గమనిస్తోందని, వచ్చే ఆరునెలలో అవుట్‌సోర్సింగ్ రంగం పురోగతి సాధిస్తుందని నాస్‌కామ్ వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి