రూపాయికి రూపం
రూపాయికి రూపం వచ్చింది. అన్ని కరెన్సీలకు గుర్తులు ఉన్నప్పుడు భారతదేశం రూపాయికి గుర్తింపు ఎందుకు ఉండకూడదూ? ఈ ఆలోచన ఇటీవల రావడంతో దానికి ఒక రూపం ఇచ్చారు. ఈ రూపానికి అధికారికంగా ఆమోదం లభించిన వెంటనే అన్ని కంప్యూటర్ల కీబోర్డులోకి డాలర్ వచ్చినట్లే రూపాయికూడా తీసుకురావడానికి బెంగుళూరుకు చెందిన ఫారడిన్ టెక్నాలజీస్ సంస్థ తన ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ ప్రయత్నంలో భాగంగా టిటిఎఫ్ (ట్రూ టైప్ ఫాంట్)ను రూపొందించింది. దీనికి Rupee Foradianగా నామకరణం చేసింది. సాధారణంగా అన్నిరకాల డెస్క్టాప్ అప్లిషన్లలో దీనిని అందించే ప్రయత్నం చేసింది. ముందుగా ఈ ఫాంట్ను సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 7 లేదా అంతకుముందు వచ్చిన విస్టాలో అయితే రన్ చేసి ఇన్స్టాల్ అంటే సరిపోతుంది. విండోస్ ఎక్స్పివరకు ఈ సాఫ్ట్వేర్ను సి ప్రామ్ట్లో విండోస్/ ఫాంట్ ఫోల్డర్లో కాపీ చేస్తే చాలు. ఆవెంటనే ఒక మారు సిస్టమ్స్ను రీ స్టార్ట్ చేసే వెంటనే రూపాయి ఫాంట్ అందుబాటులోకి వస్తుంది. ఇది కీ బోర్డులో ఎక్కడ ఉంటుందో వెదుక్కోనక్కర లేకుండా కూడా సెలక్ట్ చేసిన కీలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కాస్త శ్రమతో కూడిన వ్యవహారం కనుక ఆల్ట్ కీ పట్టుకు '0096' టైప్ చేస్తే చాలు కావాల్సిన కీలో ఈ ఫాంట్ కనిపిస్తుంది. అలా కాకుండా Rupee Fofradian ఫాంట్ను సెలక్ట్చేసి టాబ్ పైన ఉన్న కీని టైప్ చేస్తే చాలు రూపాయి గుర్తు కనిపిస్తుంది. మీరు కూడా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఫారడిన్ టెక్నాలజీ సైట్ను ఒకమారు సందర్శించండి. ఇమేజ్లను ఫాంట్లుగా మార్చుకునే సాఫ్ట్వేర్స్ ఎన్నో ఉన్నాయి. కావాల్సిన అక్షర కావాల్సిన ప్రదేశంలో కనిపించాలన్న లక్ష్యంతో గ్రాఫికల్ సాఫ్ట్వేర్స్ ఎన్నో వచ్చాయి. ముందుగా కావాల్సిన ఇమేజ్ను ఎంపిక చేసి దానిని ఫాంట్గా తయారు చేయడాని సదరు సాఫ్ట్వేర్ అప్లికేషన్ను రన్ చేస్తే కావాల్సిన ఫాంట్ కావాల్సిన విధంగా తయారువుతుంది. దానికి కూడా ముందు ఫాంట్ పేరు చివర సదరు ఫాంట్ను రూపొందించడానికి ఉపయోగించిన అప్లికేషన్ పేరుతో టిటిఎఫ్ ఫాంట్ రూపొందుతుంది.
26, ఆగస్టు 2010, గురువారం
17, జులై 2010, శనివారం
సైబర్ క్రిమినల్ ఆటకట్టు
సైబర్ క్రిమినల్ ఆటకట్టించేందుకు ఎర వేశారు. ఈ ఎరను హనీపాట్గా వ్యవహరిస్తున్నారు. ట్వీట్టర్లో సాధరణ సభ్యత్వం తీసుకున్న కొంతమంది నిపుణులు సైబర్నేరగాళ్ల ఆటకట్టించేందుకు వీలుగా 61 హనీపాట్స్ పోస్ట్ చేశారు. ఈ హనీపాట్స్కు 30,867 మంది స్పామర్లు చిక్కారు. ఇలా స్పామర్ల ఆటకట్టించేందుకు టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థులు పరిశోధకులు కొత్త పరిశోధనకు నాంది పలికారు. వీరు ముందుగా ట్వీట్టర్ను వేదిక చేసుకున్నారు. ఆతర్వాత ఇతర సామాజిక వెబ్సైట్లను వేదిక చేసుకుని సైబర్నేరగాళ్ల ఆటకట్టించే యత్నంలో టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థులు, శాస్తవ్రేత్తలు నడుంబిగించారు.
చైనాలో బ్లాక్ హాక్ సేప్టీనెట్
బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ అంటే ఇదో కంపెనీ అనుకుంటే పొరపాటు. సైబర్నేరగాళ్లను తయారు చేసే కేంద్రం. హ్యాక్ చేయడం ఎలా అన్న అంశంలో శిక్షణ నిస్తున్న ఈ బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ రహస్యంగా నిర్వహిస్తున్న సంస్థ. ఈ సంస్థ తీరు తెన్నులు గత సంవత్సరం చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ సంస్థను రహస్యంగా నిర్వహిస్తున్నారని. కంప్యూటర్ నిపుణులకు, విద్యావంతులకు హ్యాక్ చేయడంలో శిక్షణ నిస్తున్నారన్న విషయం చైనా నేరపరిశోధన సంస్థ దృష్టికి వచ్చింది. ఈ సంస్థలో శిక్షణపొందిన వ్యక్తి ఒకరిని అదుపులో తీసుకున్నప్పుడు ఈవిషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అప్పట్లో చైనా గోప్యంగా ఉంచింది. ఎందుకంటే చైనాప్రభుత్వానికి చెందిన విలువైన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లలో తొంగిచూశారని ఆరోపిస్తూ దీనికి గుగూల్ సర్చ్ ఇంజన్ సహకరిస్తుందని ఆరోపణ చేస్తున్న రోజులు అవి. అందుకే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే అప్పట్లో చైనా నుంచే సైట్లు హాక్ చేస్తున్నారంటూ అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ గగ్గోలు పెట్టింది. ఏది ఏమైనా బ్లాక్ హాక్ సెఫ్టీనెట్ వ్యవహారం గుట్టు రట్టు అయింది. ఇందులో శిక్షణ పొందిన వారు ఎలాంటి ఫైర్వాల్ ఏర్పాటు చేసినా నెట్వర్క్లోని కంప్యూటర్లను హాక్ చేయగలరని తెలుస్తోంది. వీరి ముందు చైనా గ్రేట్ ఫైర్వాల్ సైతం దిగదుడిపే అన్నమాట.
చైనాలో బ్లాక్ హాక్ సేప్టీనెట్
బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ అంటే ఇదో కంపెనీ అనుకుంటే పొరపాటు. సైబర్నేరగాళ్లను తయారు చేసే కేంద్రం. హ్యాక్ చేయడం ఎలా అన్న అంశంలో శిక్షణ నిస్తున్న ఈ బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ రహస్యంగా నిర్వహిస్తున్న సంస్థ. ఈ సంస్థ తీరు తెన్నులు గత సంవత్సరం చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ సంస్థను రహస్యంగా నిర్వహిస్తున్నారని. కంప్యూటర్ నిపుణులకు, విద్యావంతులకు హ్యాక్ చేయడంలో శిక్షణ నిస్తున్నారన్న విషయం చైనా నేరపరిశోధన సంస్థ దృష్టికి వచ్చింది. ఈ సంస్థలో శిక్షణపొందిన వ్యక్తి ఒకరిని అదుపులో తీసుకున్నప్పుడు ఈవిషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అప్పట్లో చైనా గోప్యంగా ఉంచింది. ఎందుకంటే చైనాప్రభుత్వానికి చెందిన విలువైన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లలో తొంగిచూశారని ఆరోపిస్తూ దీనికి గుగూల్ సర్చ్ ఇంజన్ సహకరిస్తుందని ఆరోపణ చేస్తున్న రోజులు అవి. అందుకే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే అప్పట్లో చైనా నుంచే సైట్లు హాక్ చేస్తున్నారంటూ అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ గగ్గోలు పెట్టింది. ఏది ఏమైనా బ్లాక్ హాక్ సెఫ్టీనెట్ వ్యవహారం గుట్టు రట్టు అయింది. ఇందులో శిక్షణ పొందిన వారు ఎలాంటి ఫైర్వాల్ ఏర్పాటు చేసినా నెట్వర్క్లోని కంప్యూటర్లను హాక్ చేయగలరని తెలుస్తోంది. వీరి ముందు చైనా గ్రేట్ ఫైర్వాల్ సైతం దిగదుడిపే అన్నమాట.
ఆన్లైన్ సంగీతం షేరింగ్ కేసులో మలుపు
ఇంటర్నెట్లో సంగీతం (పాటల) షేరింగ్ కేసు మలుపు తిరిగింది. ప్రముఖ కంపెనీకి చెందిన 30 పాటలను ఆన్లైన్లో షేరింగ్ చేసిన బాస్టన్ యూనివర్శిటీ విద్యార్థికి విధించిన భారీ జరిమానా చెల్లించ కుండా ఫెడరల్ జడ్జి మినహాయింపు నిచ్చారు. లాభాపేక్షలేకుండా, ఏలాంటి ఆదాయంలేకుండా 30 పాటలను ఆన్లైన్లో షేరింగ్ ఇచ్చిన విషయాన్ని గమనించిన నేపధ్యంలో కేసు ప్రాథమిక విచారణలో కోర్టు విధించిన జరిమానాకు మినహాయింపు లభించింది. అయితే కాపీ రైట్ చట్టం కింద జరిగిన పొరపాటు క్షమించరానిదని అన్నారు. పీర్ - పీర్ నెట్వర్క్ ద్వారా షేరింగ్ చేస్తున్నవారికి కేసు విచారణ గుబులు పుట్టిస్తోంది. విద్యార్థులు ఆకతాయిగా ఇంటర్నెట్లో చేసిన పనిని కఠినంగా వ్యవహరించవద్దని చేస్తున్న నేపధ్యంలో కేసు మలుపులు తిరిగే అవకాశం ఉంది. పైరసీని నిరోధించే క్రమంలో ఆన్లైన్లో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టే క్రమంలో కేసు విచారణ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇలాంటి కేసు గతంలో విచారణ జరిగిన సమయంలో 24 పాటలను షేరింగ్ చేసిన సమయంలో కూడా జడ్జి విధించిన జరిమానా చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. ఏది ఏమైనా ఆన్లైన్లో పీర్ - పీర్ నెట్వర్క్ ద్వారా సినిమాలు, సంగీతం, వీడియోలు, పుస్తకాలు, సాఫ్ట్వేర్స్ షేరింగ్ చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇలా పీర్ టూ పీర్ నెట్వర్క్లో షేరింగ్ చేస్తున్న వారికి ఏ కేసు ఎప్పుడు ఎదురవుతుందో అనే భయం పట్టుకుంటోంది. ఇది ఒక వ్యవస్థలో సభ్యత్వం తీసుకున్నవారి మధ్యనే డేటా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది. అలాంటప్పుడు వ్యవస్థ నిర్వహించే విధానాన్ని ఎందుకు తప్పుపట్టకూడదన్న వాదన కూడా బయలు దేరుతోంది. ఇదే చర్చకు వస్తే వివిధ సందర్భాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తప్పు పట్టాల్సి వస్తుంది. అలాంటపప్పుడు పీర్ టూ పీర్ నెట్వర్క్ ద్వారా జరుగుతున్న ప్రయోజనాలు దెబ్బతింటాయి. కనుక ఈ విషయంలో తగు వెసులు బాటు చూపాలన్న వాదన కూడా వినపడుతోంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో పుస్తకాలు, విజ్ఞాన సంబంధించిన అంశాలు లైబ్రరీద్వారా ఆన్లైన్లోని ఒకే గ్రూపు విద్యార్థుల మధ్య డేటా ఇచ్చిపుచ్చుకునే విధానానికి ఆంక్షల ఉచ్చు బిగుసుకున్నట్లే అన్న వాదన బయలు దేరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు డేటాషేరింగ్ విషయాన్ని పక్కనపెడితే ఆన్లైన్లో విలువైన సంగీతం పైరసీకి తావుఇవ్వడం తప్పేకనుక ఈ విషయంలో మినహాయింపులు ఉండకూడదన్న వాదన తమకు నష్టం జరిగిందన్న కంపెనీలు వాదిస్తున్నాయి.
16, జులై 2010, శుక్రవారం
మళ్లీ చైనాలో గూగుల్ సర్చ్
ఎట్టకేలకు గూగుల్ విజయం సాధించింది. చైనాలో గూగుల్ వెబ్సైట్ నిర్వహణకు ప్రభుత్వ అనుమతిని సంపాదించగలిగింది. చైనాలో గూగుల్ సర్చ్ వెబ్సైట్పై ఆంక్షలు వెలువడినా ఇతర విషయాలలో తన సేవలు అందించడానికి వెనుకాడలేదు. ముఖ్యంగా ప్రాంతీయ భాషావెబ్సైట్ల నిర్వహణకు తోడ్పడుతూ వస్తోంది. అత్యధిక వెబ్ యూజర్లు ఉన్న చైనాలో ఎక్కువ మంది గూగుల్ డాట్ సిఎన్ సైటుపైనే మోజుపెట్టుకున్నారు. వెబ్లో ఏ సమాచారం కావాలన్నా సదరు సైటులోకి వెళ్ళి శోధించేవారే. చైనా ప్రజలే కాదు, అక్కడి అధికారులుసైతం గూగుల్ అభిమానులే. ఇంతమంది అభిమానం చూరగొన్న గూగుల్ మాత్రం నిషేధకాలంలో తన సేవలు వెనక్కు తీసుకోలేదు. ఎక్కువ ఎదురుగాలి వీచడంవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలా ఉంటే ప్రత్యర్థులు సైతం ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతుండటం చూస్తూ ఉండిపోయింది. ఈ నిషేధ సమయంలో చైనా సర్చ్ ఇంజన్ బైదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, వెబ్ ఆధారిత ల్యాబ్ నిర్వహించడంలో గూగుల్ ముందుంది. ఈ క్రమంలోనే గూగుల్ డాట్ సిఎన్ సర్చ్ సైటు మూత పడలేదు. సింగపూర్ కేంద్రంగా గూగుల్ సైటు నిర్వహణ సాగింది. కానీ చైనా ఆంక్షల నేపధ్యంలో తూచి తూచి అడుగు వేసింది. ఈ క్రమంలో చైనాలో గూగుల్ మళ్లీ అడుగుపెట్టడం జరుగుతుందా అన్న ఆలోచన బయలు దేరింది. ఈ క్రమంలోనే గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆండరాయిడ్ మొబల్స్ విడుదల కాలేదు. దీనికి తోడు మోటరోలా లాంటి ఇంతర కంపెనీలు సైతం తమ మొబైల్స్లో బైదూ సర్చ్కు ప్రాధాన్యత కల్పించారు. ఏది ఏమైనా తిరిగి గూగుల్ వెబ్పేజీ ప్రారంభానికి చైనాలో అనుమతి లభించడంతో క్రమంగా పూర్వవైభవం కలిగే అవకాశం ఉంది. అయితే గూగుల్ ఇప్పటికైనా సర్చ్ విషయంలో ఆచి తూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా అశ్లీల ప్రొనో సైట్లు, చైనా ప్రభుత్వ వ్యతిరేక వెబ్పేజీలు సర్చ్లో కనిపించకుండా జాగ్రత్త పడితే కాని మళ్లీ నిలదొక్కుకోలేదు. ప్రపంచంలో అత్యధిక వెబ్యూజర్లు ఉన్న చైనాలో గూగుల్ తన స్థానాన్ని నిలుపుకునేందుకు బైదుకు పొటీగా నిలపడకతప్పదు.
9, జులై 2010, శుక్రవారం
మనసులో మాటకు ‘వేదిక’
మనసులో మాట చెప్పుకోడానికి వెలుస్తున్న సోషల్నెట్వర్క్ సైట్లు దిదిన ప్రవర్ధమానం అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తమ నెట్వర్క్ను తీర్చిదిద్దేంకు వివిధ వెబ్సైట్లు కృషి చేస్తున్నాయి. సోషల్నెట్వర్క్ సర్వీసులను అందించే వెబ్సైట్లలో చాలా కాలంగా ఎన్నో వెలుస్తున్నా అత్యంత ఆదరణ చూరగొన్నదిగా ఫేస్బుక్కు గుర్తింపు వచ్చింది. చాలా మందికి తెలిసిన ఫేస్బుక్, ఆర్కుట్, ట్విట్టర్, మైస్పేస్, లింక్డిన్ తమ తమ వాటాదారులను సంపాదించుకుంటున్నాయి. సోషల్నెట్వర్క్లో అన్నింటికన్నా ఫేస్బుక్ వినియోగదారుల మన్ననలు అందుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఆర్కుట్వైపు మొగ్గు చూపేవారు క్రమంగా వారు ఫేస్బుక్వైపు తమ చూపులు మరలుస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ నెట్వర్క్ అందిస్తున్న వెబ్సైట్లలో ఫేస్బుక్, మై స్పేస్, ట్విట్టర్, లింక్డిన్, నింగ్, టాగ్, క్లాసమేట్స్, హి 5, మై ఇయర్బుక్, మీట్ ఆప్, బీబో, మై లైఫ్, ఫ్రెండ్స్టర్, మైహెరిటేజ్, మల్టీఫ్లై, ఆర్కుట్, బాదో, గయా ఆన్లైన్, బాక్ ప్లానెట్ స్కైరాక్ తదితరాలు ఉన్నాయి. ఫేస్బుక్ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించుకోడానికి ఏర్పాటు చేసిన వెబ్పేజీ ప్రాథమిక నమూనానే క్రమంగా సోషల్నెట్వర్క్ ఏర్పాటుకు మూలం అయింది. ఈ సంవత్సరం ప్రథమార్థానికి సుమారు 25 కోట్ల మంది వినియోగదారులు ప్రతినెల తమ సైటును సందర్శిస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా మైస్పేస్ను 12 కోట్ల 20 లక్షల మంది, ట్విట్టర్ను ఎనిమిది కోట్ల ఐదు లక్షల మంది, లింక్టిన్ ఐదుకోట్ల మంది, ఆర్కుట్ను 4కోట్ల 50లక్షల మంది ప్రతినెలా తమ సైటును సందర్శిస్తున్నవారిలో ఉన్నారు. ఎప్పటిక్పుడు వినియోగదారులు తాము ఏర్పాటు చేసుకున్న సోషల్నెట్వర్క్లోని సైటను నెలలో ఎన్నిమార్లు సందిర్శిస్తున్నారన్న ప్రాతిపదికపై సర్వే నిర్వహించారు. హిట్టింగ్రేట్కు అనుగుణంగా ఫేస్బుక్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంతమంది వినియోగదారులు ఉన్నారని కాదు. ఎంతమంది వినియోగదారులు సమర్థవంతంగా సైటును ఉపయోగించగలుగుతున్నారన్న ప్రాతిపదికపేనే సోషల్నెట్వర్క్ మనుగడ ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా కొత్తగా ఇమెయిల్ ఐడి (వెబ్చిరునామా) ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆయా చిరుమానామా నమోదు చేసిన సైటుకు సంబంధించి సోషల్నెట్వర్క్ ఖాతా పై మీకు మక్కువ ఉందా? ఉంటే ప్రారంభించండి అంటూ సందేశం కనిపిస్తుంది. ఆదిలో తమకంటూ సోషల్నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా సదరు సైటులో ఇప్పటికే నమోదు అయినవారు పరిచయం చేస్తేకానీ సోషల్నెట్వర్క్లోకి సభ్యత్వ లభించేది కాదు. భారదేశంలోని ఎక్కువ మంది వినియోగదారలు ఆర్కుట్పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అది ఇప్పుడు క్రమంగా ఫేస్బుక్వైపు వారి చూపులు మరలాయి. సోషల్నెట్వర్క్ సైట్లు వివాదం అయిన తరువాతనే ప్రచారంలోకి వచ్చాయి. ఆర్కుట్లో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సైటులో తొంగి చూసి స్నేహం చేయడంవల్ల తొలుత ప్రచారం చోటు చేసుకుంది. ఆర్కుట్లో స్నేహం చేసినవారిలో ఎక్కువ మంది యువతీ యువకులు వివాహాల వరకు వెళ్ళిన వారు ఉన్నారు. వివాదాలు కొనితెచ్చుకున్నవారు ఉన్నారు. దాపరికంలేకుండా మనసులో మాటచెప్పడమేకాదు కళ్లకు కట్టిట్టు చూపడంవల్ల ఫేస్బుక్ ఎక్కువ ఆదరణ చూరగొన్నది. ప్రముఖులు ఫేస్బుక్లో వెల్లడించిన తమ జీవితరహస్యాల వల్ల ఎందరో వివాదాల పాలు అయిన సందర్భాలు ఉన్నాయి. మనసులో మాట చెప్పాంటే ఇది వేదిక అయింది. ఈ వేదిక మీద చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తాయి. ఆత్మీయుల గుండెతలుపులను తడుతాయి. సోషల్నెట్వర్క్లో చాలా మంది ఖాతా తెరుస్తారు కానీ, అప్డేట్ చేయడానికి ముందుకు రారు. ఇలా నిరర్థంగా ఉన్న సోషల్నెట్వర్క్ చిరునామాలు ఒక్కో సైటులో 60 శాతంపైగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఫేస్బుక్, ఆర్కుట్ సోషల్నెట్వర్క్పైన ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అసలు ఈ సైట్లవైపు వినియోగదారులు ఎందుకు మక్కువచూపుతున్నారో పరిశీలిస్తే సులభంగా వెబ్పేజీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అన్ని విషయాలు అప్డేట్ చేయడంవరకు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో సైటు డిజైన్, వేగం, రిలవెన్సీ, కొత్త అప్లికేషన్లు, స్నేహితులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఫొటోలు, వీడియోలు, నోటిఫికేషన్లు, చాట్ తదితరాలుకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాధాన్యత ఇచ్చేక్రమంలో ప్రాంతీయ భాషలో వినియోగదారుడు తమ అభిప్రాయం చెప్పగలగడం అగ్రస్థానాన నిలుస్తుంది.
లేబుళ్లు:
ఆంధ్రభూమి,
మ,
సాధన సంచికలో 10-07-2010 ప్రచురిచిన వ్యాసం
21, ఫిబ్రవరి 2010, ఆదివారం
ఐటి కెరీర్కు ఇక ఢోకా లేదు
ఐటి కెరీర్కు ఇక ఢోకా లేదు
భారత దేశంలో ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. పెండింగ్లో ఉన్న అభ్యర్థుల నియామకాలకు గత రెండు నెలల క్రితమే వివిధ కంపెనీలు శ్రీకారం చుట్టగా ఈ సంవత్సరంలో సుమారు 50వేల మందిని మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించే దశలో ప్రధాన ఐటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం మళ్లీ క్యాంపస్ ఇంటర్య్వూల పేర తమ ద్వారాలు తెరిచాయి. ఈ నేపధ్యంలో ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో తదితర కంపెనీలు కళాశాలలో క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించే దిశగా పను ప్రారంభించినట్లు భోగట్టా. ఐటి రంగంలో మానవ వనరులను ప్రోత్సహించి వారికి ప్రయోజనాలు అందించే దిశలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందుగా శిక్షణ నిచ్చే పనులను ప్రారంభించింది. క్యాంపస్ ఇంటర్య్వూలలో వివిధ కంపెనీలకు సిఎస్ఐ చేదోడుగా ఉంటున్న విషయం విధితమే. ఇది ఇలా ఉండగా వచ్చే మూడు నెలలలోటిసిఎస్ సుమారు 30 వేల మందిని ఉద్యోగాలలో తీసుకోనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. 30 వేల మందిలో కొత్తవారికి 70 శాతం వరకు అవకాశం కల్పిస్తామని అదే విధంగా అనుభవం ఉన్న వారిని 30 శాతం వరకు ఎంపిక చేస్తామి కూడా టిసిఎస్ తెలుపుతోంది. ఇది ఇలా ఉంటే కొత్తవారి ఎంపిక కంటే గత సంవత్సరంగా ఖాళీ ఉన్న వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే దిశలో ప్రముఖ కంపెనీలు ముందుకు వెళుతున్నాయి. అయితే పట్టాతీసుకున్న తరువాత గడిపిన కాలంలో వారు ఏమి చేశారనే విషయంపైననే వౌఖిక ఇంటర్వ్యూలలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కెరీర్కు చాలా కాలంగా దూరం ఉన్నవారు నడుచుకున్న నడవడికపైన వారి ఆలోచన, తీరు తెన్నులు ఆధారపడుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. విప్రోసుమారు పదివేల మందికి అవకాశం కల్పించ నుండగా, మైక్రోసాఫ్ట్ ఒకడుగు ముందుకు వేసి హైదరాబాద్ క్యాంపస్లోని సుమారు 15 వేల మంది మానవవనరులకు అవకాశం కల్పించనున్నది. అంతే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల తగు ప్రాధాన్యత కల్పిచడానికి వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కేవలం ఈ పురోభివృద్ధి సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. హార్డ్ వేర్ రంగంలో నిపుణులకు అవకాశాలు గుమ్మం తడుతున్నాయి. హెచ్సిఎల్, రాక్వెల్ కలిన్స్, జియోమెట్రిక్, సీమెన్స్, హనీవెల్, టాటా, టెక్ మహీంద్రా, హెగ్జావేర్ టెక్నాలజీస్ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించ నున్నట్లు ఆయా వెబ్సైట్లలో తెలుపుతున్నాయి. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వివరాలు క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించనున్న కళాశాలలకు పంపినట్లు భోగట్టా. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి పరిశ్రమల పురోగతి అధికంగా ఉంటుందని, దేశీయంగా 17 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశం ఉందని నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వెల్లడించారు. అవుట్సోర్సింగ్పై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని దేశీయ ఐటి కంపెనీలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా ఇప్పడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మరింత మెరగుపడుతుందని నాస్కామ్ చైర్మన్ ప్రమోద్ భాసిన్ చెప్పారు. దేశంలో ఐటి రంగంలో జరుగుతున్న అభివృద్ధిని నాస్కామ్ గమనిస్తోందని, వచ్చే ఆరునెలలో అవుట్సోర్సింగ్ రంగం పురోగతి సాధిస్తుందని నాస్కామ్ వెల్లడించింది.
భారత దేశంలో ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. పెండింగ్లో ఉన్న అభ్యర్థుల నియామకాలకు గత రెండు నెలల క్రితమే వివిధ కంపెనీలు శ్రీకారం చుట్టగా ఈ సంవత్సరంలో సుమారు 50వేల మందిని మానవ వనరులకు ఉద్యోగాలు కల్పించే దశలో ప్రధాన ఐటి కంపెనీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం మళ్లీ క్యాంపస్ ఇంటర్య్వూల పేర తమ ద్వారాలు తెరిచాయి. ఈ నేపధ్యంలో ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో తదితర కంపెనీలు కళాశాలలో క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించే దిశగా పను ప్రారంభించినట్లు భోగట్టా. ఐటి రంగంలో మానవ వనరులను ప్రోత్సహించి వారికి ప్రయోజనాలు అందించే దిశలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందుగా శిక్షణ నిచ్చే పనులను ప్రారంభించింది. క్యాంపస్ ఇంటర్య్వూలలో వివిధ కంపెనీలకు సిఎస్ఐ చేదోడుగా ఉంటున్న విషయం విధితమే. ఇది ఇలా ఉండగా వచ్చే మూడు నెలలలోటిసిఎస్ సుమారు 30 వేల మందిని ఉద్యోగాలలో తీసుకోనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. 30 వేల మందిలో కొత్తవారికి 70 శాతం వరకు అవకాశం కల్పిస్తామని అదే విధంగా అనుభవం ఉన్న వారిని 30 శాతం వరకు ఎంపిక చేస్తామి కూడా టిసిఎస్ తెలుపుతోంది. ఇది ఇలా ఉంటే కొత్తవారి ఎంపిక కంటే గత సంవత్సరంగా ఖాళీ ఉన్న వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే దిశలో ప్రముఖ కంపెనీలు ముందుకు వెళుతున్నాయి. అయితే పట్టాతీసుకున్న తరువాత గడిపిన కాలంలో వారు ఏమి చేశారనే విషయంపైననే వౌఖిక ఇంటర్వ్యూలలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కెరీర్కు చాలా కాలంగా దూరం ఉన్నవారు నడుచుకున్న నడవడికపైన వారి ఆలోచన, తీరు తెన్నులు ఆధారపడుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. విప్రోసుమారు పదివేల మందికి అవకాశం కల్పించ నుండగా, మైక్రోసాఫ్ట్ ఒకడుగు ముందుకు వేసి హైదరాబాద్ క్యాంపస్లోని సుమారు 15 వేల మంది మానవవనరులకు అవకాశం కల్పించనున్నది. అంతే కాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల తగు ప్రాధాన్యత కల్పిచడానికి వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కేవలం ఈ పురోభివృద్ధి సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. హార్డ్ వేర్ రంగంలో నిపుణులకు అవకాశాలు గుమ్మం తడుతున్నాయి. హెచ్సిఎల్, రాక్వెల్ కలిన్స్, జియోమెట్రిక్, సీమెన్స్, హనీవెల్, టాటా, టెక్ మహీంద్రా, హెగ్జావేర్ టెక్నాలజీస్ సంస్థలలో ఉపాధి అవకాశాలు కల్పించ నున్నట్లు ఆయా వెబ్సైట్లలో తెలుపుతున్నాయి. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన వివరాలు క్యాంపస్ ఇంటర్య్వూలు నిర్వహించనున్న కళాశాలలకు పంపినట్లు భోగట్టా. గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటి పరిశ్రమల పురోగతి అధికంగా ఉంటుందని, దేశీయంగా 17 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యే అవకాశం ఉందని నాస్కామ్ అధ్యక్షుడు సోమ్ మిట్టల్ వెల్లడించారు. అవుట్సోర్సింగ్పై అమెరికా అధ్యక్షుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా భయపడాల్సిన అవసరం లేదని దేశీయ ఐటి కంపెనీలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. అంతే కాకుండా ఇప్పడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మరింత మెరగుపడుతుందని నాస్కామ్ చైర్మన్ ప్రమోద్ భాసిన్ చెప్పారు. దేశంలో ఐటి రంగంలో జరుగుతున్న అభివృద్ధిని నాస్కామ్ గమనిస్తోందని, వచ్చే ఆరునెలలో అవుట్సోర్సింగ్ రంగం పురోగతి సాధిస్తుందని నాస్కామ్ వెల్లడించింది.
క్రేజీ బ్రౌజర్ సరికొత్త వర్షన్
క్రేజీ బ్రౌజర్ సరికొత్త వర్షన్
ఇంటర్నెట్లో వేగంగా దూసుకు వెళ్లడానికి వీలుగా క్రేజీ బ్రౌజర్ నడుం బిగించింది. కేవలం వారం రోజుల వ్యవధిలో వినియోగదారుల ప్రయోజనాలకోసం సరికొత్త వర్షను విడుదల చేసింది. అత్యాధునిక సదుపాయాలతో క్రేజీ బ్రౌజర్ 3.03 వర్షన్ ఫిబ్రవరి 12న విడుదల అయింది. మారుతున్న టెక్నాలజీకి దర్పణం పట్టేవిధంగా ఇందులో ప్లగ్గిన్స్ జోడించారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తగా సుమారు 56 బాషలను సపోర్టు చేసే విధంగా సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా భారతీయ సపోర్టు చేయడం ప్రత్యేక ఆకర్షణ. కేవలం 0.7 ఎంబి ఫైలుతో బ్రౌజర్ రన్ అవుతుంది. సాధారణంగా అందుబాటులోకి వచ్చిన ఇతర బ్రౌజర్లతో పోలిస్తే అతి చిన్న బ్రౌజర్ ఇదే. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరల్లో ఉన్న సదుపాయాలను తనవిగా చేసుకుంటూ, కంప్యూటర్లో ఇతర సాఫ్ట్వేర్స్ ఉపయోగిస్తుంటే కావాల్సిన వాటిని సపోర్టు తీసుకుంటూ పనిచేయడం క్రేజీ బ్రౌజర్ ప్రత్యేకత. ఇందులో అడ్వటైజ్మెట్ల బాధలేదు. ఖరీదు చేయాల్సిన అవసరమూలేదు. ఉచితంగా ఆన్లైన్ నుండి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్రస్ బార్లో టైప్చేసిన ప్రతి చిరునామాను ఇది గుర్తుంచకుంటుంది. అలాగని వాటికి సంబందించిన కూకీలు, ఇతర ఇమేజ్లను కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటుందనుకునే భయం అక్కరలేదు. అనవసర విషయాల జోలికి ఇది వెళ్లదు. అతి తక్కువ వేగం అంటే 56 కిలోబైట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్లో సైతం కేవలం మూడు నిముషాలలో దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అత్యాధునిక ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ - 7, విండోస్ విస్టాతోపాటు విండోస్ ఎక్స్పి, విండోస్ ఎన్టి, విండోస్ 2000, విండోస్ 98, విండోస్ 95లలో సైతం ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే క్రేజీ బ్రౌజర్ ఉపయోగిస్తున్నవారికి కొత్త వర్షన్ వచ్చింది డౌన్లోడ్ చేసుకొమ్మనే సందేశం డెస్క్టాప్పై ప్రత్యక్షం అయింది. ఒక వౌస్ క్లిక్తో http://www.crazybrowser.com/download.htm సైటు నుండి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6న 3.01 వర్షన్ విడుదల చేసిన ఆరు రోజులకే మరో వర్షన్ విడుదల చేయడం ఏమిటీ అనే సందేహం కలుగవచ్చు. పాత వర్షన్లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఇంటర్నెట్లో విహరించడానికి వీలుగా సదుపాయాలు ఇందులో జోడించారు. మోదట 2002 సంవత్సరం జనవరి 15 తొలి క్రేజీ బ్రౌజర్ 1.0వర్షన్ను ఆవిష్కరించారు. ఆతరువాత ఎనిమిది సంవత్సరాల కాలంలో వరుసగా సుమారు 15 మార్లు దీనిని అప్డేట్ చేస్తూ వచ్చారు. వివిధ ప్రాంతీయ భాషలను సపోర్టు చేసే విధంగా c:\Program Files\Crazy Browser\Languages\ నేరుగా ఢౌన్లోడ్ చేసుకుంటుంది. బ్రౌజర్ను ఇన్స్టాల్ చేశాక ఒకమారు కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన వెంటనే కంట్రోల్ ప్యానల్ లాంగ్వేజస్ మెనూ నుంచి ప్రాంతీయ భాషలను సపోర్టు చేసుకోవచ్చు. అంతే కాకుండా ప్రత్యేక ప్లగ్గిన్స్ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లగ్గిన్స్ C:\Program Files\Crazy Browser\Plug-ins\ నుంఛి నేరుగా పనిచేస్తాయి. వీటిని అప్డేట్ చేసిన వెంటనే సిస్టమ్స్ను ఒక మారు రీస్టార్ట్ చేస్తే చాలు బ్రౌజర్పై ప్లగ్గిన్స్ ప్రత్యక్షం అవుతాయి. పాప్అప్ బ్లాక్ చేయడంవల్ల అనవసరమైనవి సిస్టమ్స్లో చేరుతాయనే భయం లేదు.
9, ఫిబ్రవరి 2010, మంగళవారం
ట్రాన్స్లిటరేషన్ టూల్
ప్రాంతీయ భాషలకు వెబ్లో గూగుల్ పట్టం కడుతోంది. ఇప్పటికే వెబ్ బ్రౌజర్ల ద్వారా ఆన్లైన్ పేజీ ఒపెన్ చేసిన తరువాత కావాల్సిన ప్రాంతీయ భాషలో టైప్ చేసుకునే విధానాన్ని గూగుల్ ఇదివరకే ప్రవేశపెట్టింది. అయితే ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్లిటరేషన్ ఐఎంఇ డౌన్లోడ్కు ఈ వారం సిద్దం చేసింది. ఇప్పటివరకు కేవలం బ్రౌజర్ ఒపెన్ చేసి కావాల్సిన వెబ్పేజీ ఒపెన్ చేసినప్పుడే ఎంచుకున్న ప్రాంతీయ భాషలో టైప్ చేసే ఏర్పాట్లను ప్రత్యేక పరిస్థితులలో కల్పించింది. కేవలం ఆన్లైన్లో ఉంటేనే ఈ సదుపాయం కలిగేది. కానీ ప్రస్తుతం ఆఫ్లైన్లో కూడా ప్రాంతీయ భాష ఎంచుకునే విధంగా మొట్టమొదటి సారి యూనిక్ కోడ్లో టైప్చేసుకునేలా అప్లికేషన్ను డౌన్లోడ్కు ఈ వారం నుంచి వెబ్సైట్లో ఉంచింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్http://www.google.com/ime/transliteration/వెభ్పేజీలో సిద్దంగా ఉంది. ట్రాన్స్లిటరేషన్ ఐఎంఇ అంటే ప్రాంతీయ భాషలోకి పదాలను మార్చుకునే ఇన్పుట్ మెథడ్ ఎడిటర్ అన్నమాట. ఇన్పుట్ మెథడ్ ఎడిటర్ను కంప్యూటర్లో పై సైట్నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోదు. వెంటనే తగు సెట్టింగ్స్ కంట్రోల్ ప్యానల్లో చేసుకోవాల్సి ఉంటుంది. ఒక భాషను ఎంచుకున్న వారికి ఒకే భాషలో టైప్ చేసుకునే సదుపాయం కలిగేలా, బహుళ బాషలు ఎంచుకున్న వారికి బహుళ భాషలలో టైప్ చేసుకునేలా ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఫాంట్స్ ఇన్స్టాల్కోసం విడివిడిగా ఆయా ప్రాంతీయ భాషలను ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, ఉర్దూ, గుజరాతీ, అరబిక్, బెంగాలీ, ఫరీషయన్, గ్రీక్ పద్నాలుగు భాషలలో ట్రాన్స్లిటరేషన్ ఇన్పుట్ మెథడ్ ఎడిటర్ లభ్యం అవుతోంది. సాధారణంగా వెబ్ పేజీల నుంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ప్రోగ్రామ్ మేనేజర్లో అప్లికేషన్ టూల్ బార్ ప్రత్యక్షం అవుతుంది. ఇందుకోసం ముందుగా కంట్రోల్ ప్యానల్లో కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ హెల్ప్ పేజీని యూజర్కు మార్గదర్శకంగా నిలుస్తుంది. అలా కానీ పక్షంలో http://www.google.com/ime/transliteration/help.html#installation వెభ్పేజీని ముందుగా ఒపెన్ చేసి గూగుల్ ట్రాన్స్లిటరేషన్ ఇన్పుట్ మెథడ్ రన్ చేయడానికి కంప్యూటర్ను ఎలా సిద్దం చేయాలో తెలుసుకోవాలి. ప్రసుతం ఈ అప్లికేషన్ టూల్ విండోస్ ఎక్స్పి, విస్టా, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్స్లలో పనిచేసేలా రూపొందించారు. ప్రస్తుతం ఇది 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో పనిచేస్తుంది. ట్రాన్స్లిటరేషన్ ఇన్పుట్ మెథడ్ కంప్యూటర్లో పనిచేయడం ప్రారంభించాక క్యూడబ్లుఇఆర్టి., కీబోర్డు ఆధారంగా టైప్ చేసుకోవచ్చు. ఇలా టైప్ చేసిన పదాలు వర్డ్, నోట్పాడ్, అన్ని వెబ్పేజీలలో కట్ పేస్ట్ పద్దతిలో పేస్ట్ చేయవచ్చు. అయితే ప్రాంతీయ భాషలలో వెబ్పేజీలను రూపొందించుకోవడానికి వీలుగా ఇదివరకే గూగుల్ ట్రాన్స్లిటరేషన్ పద్దతిని చాలా కాలం క్రితమే ప్రవేశపెట్టింది. ఆర్కుట్, జి-మెయిల్, బ్లాగ్లలో నేరుగు కంపోజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది. లిప్యాంతరీకరణ పద్దతిలో కావాల్సిన పదాలను తెలుగులో ఉచ్చారణకు అనుగుణంగా ఇంగ్లీషు కీబోర్డుపై టైప్ చేసి స్పేస్ ఇచ్చిన వెంటనే అది తెలుగు పదం కనిపించేలా గూగుల్ దీనిని ప్రవేశ పెట్టింది. ఇలా టైప్ చేసిన పదం వెబ్పేజీల అప్లోడ్కు కానీ, ఇ-మెయిల్లో లేఖలా కానీ పంపుకునే సదుపాయం కల్పించింది. ఆఫ్లైన్లో కూడా యూనిక్కోడ్లో కావాల్సిన ప్రాంతీయ భాషలో టైప్ చేసుకుని సదరు ఫైళ్లను కంప్యూటర్లో సేవ్ చేసుకున్న తరువాత వెబ్లోకి అప్లోడ్ చేసుకునే విధానం వల్ల యూజర్లకు మరింత ప్రయోజన కరంగా ఉంటుంది. అంతే కాకుండా నాన్ లాటిన్ భాషలలో కూడా వెబ్పేజీలు చక్కగా దర్శనం ఇచ్చే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే ఆన్లైన్లో గూగుల్ లాబ్ అందించిన వెబ్ పేజీ http://labs.google.co.in/keyboards/telugu.html కూఢా ప్రాంతీయ భాషలలో ఇంటర్నెట్ ఆన్లైన్లో టైపింగ్కు సదుపాయం కల్పించింది
లేబుళ్లు:
ట్రాన్స్లిటరేషన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)