17, జులై 2010, శనివారం

సైబర్ క్రిమినల్ ఆటకట్టు

సైబర్ క్రిమినల్ ఆటకట్టించేందుకు ఎర వేశారు. ఈ ఎరను హనీపాట్‌గా వ్యవహరిస్తున్నారు. ట్వీట్టర్‌లో సాధరణ సభ్యత్వం తీసుకున్న కొంతమంది నిపుణులు సైబర్‌నేరగాళ్ల ఆటకట్టించేందుకు వీలుగా 61 హనీపాట్స్ పోస్ట్ చేశారు. ఈ హనీపాట్స్‌కు 30,867 మంది స్పామర్లు చిక్కారు. ఇలా స్పామర్ల ఆటకట్టించేందుకు టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థులు పరిశోధకులు కొత్త పరిశోధనకు నాంది పలికారు. వీరు ముందుగా ట్వీట్టర్‌ను వేదిక చేసుకున్నారు. ఆతర్వాత ఇతర సామాజిక వెబ్‌సైట్లను వేదిక చేసుకుని సైబర్‌నేరగాళ్ల ఆటకట్టించే యత్నంలో టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీ విద్యార్థులు, శాస్తవ్రేత్తలు నడుంబిగించారు.
చైనాలో బ్లాక్ హాక్ సేప్టీనెట్
బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ అంటే ఇదో కంపెనీ అనుకుంటే పొరపాటు. సైబర్‌నేరగాళ్లను తయారు చేసే కేంద్రం. హ్యాక్ చేయడం ఎలా అన్న అంశంలో శిక్షణ నిస్తున్న ఈ బ్లాక్ హాక్ సేఫ్టీనెట్ రహస్యంగా నిర్వహిస్తున్న సంస్థ. ఈ సంస్థ తీరు తెన్నులు గత సంవత్సరం చైనా ప్రభుత్వం గుర్తించింది. ఈ సంస్థను రహస్యంగా నిర్వహిస్తున్నారని. కంప్యూటర్ నిపుణులకు, విద్యావంతులకు హ్యాక్ చేయడంలో శిక్షణ నిస్తున్నారన్న విషయం చైనా నేరపరిశోధన సంస్థ దృష్టికి వచ్చింది. ఈ సంస్థలో శిక్షణపొందిన వ్యక్తి ఒకరిని అదుపులో తీసుకున్నప్పుడు ఈవిషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అప్పట్లో చైనా గోప్యంగా ఉంచింది. ఎందుకంటే చైనాప్రభుత్వానికి చెందిన విలువైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్లలో తొంగిచూశారని ఆరోపిస్తూ దీనికి గుగూల్ సర్చ్ ఇంజన్ సహకరిస్తుందని ఆరోపణ చేస్తున్న రోజులు అవి. అందుకే ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే అప్పట్లో చైనా నుంచే సైట్లు హాక్ చేస్తున్నారంటూ అమెరికా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ గగ్గోలు పెట్టింది. ఏది ఏమైనా బ్లాక్ హాక్ సెఫ్టీనెట్ వ్యవహారం గుట్టు రట్టు అయింది. ఇందులో శిక్షణ పొందిన వారు ఎలాంటి ఫైర్‌వాల్ ఏర్పాటు చేసినా నెట్‌వర్క్‌లోని కంప్యూటర్లను హాక్ చేయగలరని తెలుస్తోంది. వీరి ముందు చైనా గ్రేట్ ఫైర్‌వాల్ సైతం దిగదుడిపే అన్నమాట.

ఆన్‌లైన్ సంగీతం షేరింగ్ కేసులో మలుపు

ఇంటర్‌నెట్‌లో సంగీతం (పాటల) షేరింగ్ కేసు మలుపు తిరిగింది. ప్రముఖ కంపెనీకి చెందిన 30 పాటలను ఆన్‌లైన్‌లో షేరింగ్ చేసిన బాస్టన్ యూనివర్శిటీ విద్యార్థికి విధించిన భారీ జరిమానా చెల్లించ కుండా ఫెడరల్ జడ్జి మినహాయింపు నిచ్చారు. లాభాపేక్షలేకుండా, ఏలాంటి ఆదాయంలేకుండా 30 పాటలను ఆన్‌లైన్‌లో షేరింగ్ ఇచ్చిన విషయాన్ని గమనించిన నేపధ్యంలో కేసు ప్రాథమిక విచారణలో కోర్టు విధించిన జరిమానాకు మినహాయింపు లభించింది. అయితే కాపీ రైట్ చట్టం కింద జరిగిన పొరపాటు క్షమించరానిదని అన్నారు. పీర్ - పీర్ నెట్‌వర్క్ ద్వారా షేరింగ్ చేస్తున్నవారికి కేసు విచారణ గుబులు పుట్టిస్తోంది. విద్యార్థులు ఆకతాయిగా ఇంటర్‌నెట్‌లో చేసిన పనిని కఠినంగా వ్యవహరించవద్దని చేస్తున్న నేపధ్యంలో కేసు మలుపులు తిరిగే అవకాశం ఉంది. పైరసీని నిరోధించే క్రమంలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న అక్రమాలను ఎండగట్టే క్రమంలో కేసు విచారణ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇలాంటి కేసు గతంలో విచారణ జరిగిన సమయంలో 24 పాటలను షేరింగ్ చేసిన సమయంలో కూడా జడ్జి విధించిన జరిమానా చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు. ఏది ఏమైనా ఆన్‌లైన్‌లో పీర్ - పీర్ నెట్‌వర్క్ ద్వారా సినిమాలు, సంగీతం, వీడియోలు, పుస్తకాలు, సాఫ్ట్‌వేర్స్ షేరింగ్ చేసుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఇలా పీర్ టూ పీర్ నెట్‌వర్క్‌లో షేరింగ్ చేస్తున్న వారికి ఏ కేసు ఎప్పుడు ఎదురవుతుందో అనే భయం పట్టుకుంటోంది. ఇది ఒక వ్యవస్థలో సభ్యత్వం తీసుకున్నవారి మధ్యనే డేటా ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతోంది. అలాంటప్పుడు వ్యవస్థ నిర్వహించే విధానాన్ని ఎందుకు తప్పుపట్టకూడదన్న వాదన కూడా బయలు దేరుతోంది. ఇదే చర్చకు వస్తే వివిధ సందర్భాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తప్పు పట్టాల్సి వస్తుంది. అలాంటపప్పుడు పీర్ టూ పీర్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్న ప్రయోజనాలు దెబ్బతింటాయి. కనుక ఈ విషయంలో తగు వెసులు బాటు చూపాలన్న వాదన కూడా వినపడుతోంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో పుస్తకాలు, విజ్ఞాన సంబంధించిన అంశాలు లైబ్రరీద్వారా ఆన్‌లైన్‌లోని ఒకే గ్రూపు విద్యార్థుల మధ్య డేటా ఇచ్చిపుచ్చుకునే విధానానికి ఆంక్షల ఉచ్చు బిగుసుకున్నట్లే అన్న వాదన బయలు దేరుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు డేటాషేరింగ్ విషయాన్ని పక్కనపెడితే ఆన్‌లైన్‌లో విలువైన సంగీతం పైరసీకి తావుఇవ్వడం తప్పేకనుక ఈ విషయంలో మినహాయింపులు ఉండకూడదన్న వాదన తమకు నష్టం జరిగిందన్న కంపెనీలు వాదిస్తున్నాయి.

16, జులై 2010, శుక్రవారం

మళ్లీ చైనాలో గూగుల్ సర్చ్

ఎట్టకేలకు గూగుల్ విజయం సాధించింది. చైనాలో గూగుల్ వెబ్‌సైట్ నిర్వహణకు ప్రభుత్వ అనుమతిని సంపాదించగలిగింది. చైనాలో గూగుల్ సర్చ్ వెబ్‌సైట్‌పై ఆంక్షలు వెలువడినా ఇతర విషయాలలో తన సేవలు అందించడానికి వెనుకాడలేదు. ముఖ్యంగా ప్రాంతీయ భాషావెబ్‌సైట్ల నిర్వహణకు తోడ్పడుతూ వస్తోంది. అత్యధిక వెబ్ యూజర్లు ఉన్న చైనాలో ఎక్కువ మంది గూగుల్ డాట్ సిఎన్ సైటుపైనే మోజుపెట్టుకున్నారు. వెబ్‌లో ఏ సమాచారం కావాలన్నా సదరు సైటులోకి వెళ్ళి శోధించేవారే. చైనా ప్రజలే కాదు, అక్కడి అధికారులుసైతం గూగుల్ అభిమానులే. ఇంతమంది అభిమానం చూరగొన్న గూగుల్ మాత్రం నిషేధకాలంలో తన సేవలు వెనక్కు తీసుకోలేదు. ఎక్కువ ఎదురుగాలి వీచడంవల్ల ఎదురవుతున్న ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలా ఉంటే ప్రత్యర్థులు సైతం ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతుండటం చూస్తూ ఉండిపోయింది. ఈ నిషేధ సమయంలో చైనా సర్చ్ ఇంజన్ బైదు అన్ని రంగాలలో ముందుకు వెళ్లింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, వెబ్ ఆధారిత ల్యాబ్ నిర్వహించడంలో గూగుల్ ముందుంది. ఈ క్రమంలోనే గూగుల్ డాట్ సిఎన్ సర్చ్ సైటు మూత పడలేదు. సింగపూర్ కేంద్రంగా గూగుల్ సైటు నిర్వహణ సాగింది. కానీ చైనా ఆంక్షల నేపధ్యంలో తూచి తూచి అడుగు వేసింది. ఈ క్రమంలో చైనాలో గూగుల్ మళ్లీ అడుగుపెట్టడం జరుగుతుందా అన్న ఆలోచన బయలు దేరింది. ఈ క్రమంలోనే గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆండరాయిడ్ మొబల్స్ విడుదల కాలేదు. దీనికి తోడు మోటరోలా లాంటి ఇంతర కంపెనీలు సైతం తమ మొబైల్స్‌లో బైదూ సర్చ్‌కు ప్రాధాన్యత కల్పించారు. ఏది ఏమైనా తిరిగి గూగుల్ వెబ్‌పేజీ ప్రారంభానికి చైనాలో అనుమతి లభించడంతో క్రమంగా పూర్వవైభవం కలిగే అవకాశం ఉంది. అయితే గూగుల్ ఇప్పటికైనా సర్చ్ విషయంలో ఆచి తూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా అశ్లీల ప్రొనో సైట్లు, చైనా ప్రభుత్వ వ్యతిరేక వెబ్‌పేజీలు సర్చ్‌లో కనిపించకుండా జాగ్రత్త పడితే కాని మళ్లీ నిలదొక్కుకోలేదు. ప్రపంచంలో అత్యధిక వెబ్‌యూజర్లు ఉన్న చైనాలో గూగుల్ తన స్థానాన్ని నిలుపుకునేందుకు బైదుకు పొటీగా నిలపడకతప్పదు.

9, జులై 2010, శుక్రవారం

మనసులో మాటకు ‘వేదిక’


మనసులో మాట చెప్పుకోడానికి వెలుస్తున్న సోషల్‌నెట్‌వర్క్ సైట్లు దిదిన ప్రవర్ధమానం అవుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా తమ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దేంకు వివిధ వెబ్‌సైట్లు కృషి చేస్తున్నాయి. సోషల్‌నెట్‌వర్క్ సర్వీసులను అందించే వెబ్‌సైట్లలో చాలా కాలంగా ఎన్నో వెలుస్తున్నా అత్యంత ఆదరణ చూరగొన్నదిగా ఫేస్‌బుక్‌కు గుర్తింపు వచ్చింది. చాలా మందికి తెలిసిన ఫేస్‌బుక్, ఆర్కుట్, ట్విట్టర్, మైస్పేస్, లింక్‌డిన్ తమ తమ వాటాదారులను సంపాదించుకుంటున్నాయి. సోషల్‌నెట్‌వర్క్‌లో అన్నింటికన్నా ఫేస్‌బుక్ వినియోగదారుల మన్ననలు అందుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఆర్కుట్‌వైపు మొగ్గు చూపేవారు క్రమంగా వారు ఫేస్‌బుక్‌వైపు తమ చూపులు మరలుస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ నెట్‌వర్క్ అందిస్తున్న వెబ్‌సైట్లలో ఫేస్‌బుక్, మై స్పేస్, ట్విట్టర్, లింక్‌డిన్, నింగ్, టాగ్, క్లాసమేట్స్, హి 5, మై ఇయర్‌బుక్, మీట్ ఆప్, బీబో, మై లైఫ్, ఫ్రెండ్స్‌టర్, మైహెరిటేజ్, మల్టీఫ్లై, ఆర్కుట్, బాదో, గయా ఆన్‌లైన్, బాక్ ప్లానెట్ స్కైరాక్ తదితరాలు ఉన్నాయి. ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించుకోడానికి ఏర్పాటు చేసిన వెబ్‌పేజీ ప్రాథమిక నమూనానే క్రమంగా సోషల్‌నెట్‌వర్క్ ఏర్పాటుకు మూలం అయింది. ఈ సంవత్సరం ప్రథమార్థానికి సుమారు 25 కోట్ల మంది వినియోగదారులు ప్రతినెల తమ సైటును సందర్శిస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా మైస్పేస్‌ను 12 కోట్ల 20 లక్షల మంది, ట్విట్టర్‌ను ఎనిమిది కోట్ల ఐదు లక్షల మంది, లింక్‌టిన్ ఐదుకోట్ల మంది, ఆర్కుట్‌ను 4కోట్ల 50లక్షల మంది ప్రతినెలా తమ సైటును సందర్శిస్తున్నవారిలో ఉన్నారు. ఎప్పటిక్పుడు వినియోగదారులు తాము ఏర్పాటు చేసుకున్న సోషల్‌నెట్‌వర్క్‌లోని సైటను నెలలో ఎన్నిమార్లు సందిర్శిస్తున్నారన్న ప్రాతిపదికపై సర్వే నిర్వహించారు. హిట్టింగ్‌రేట్‌కు అనుగుణంగా ఫేస్‌బుక్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంతమంది వినియోగదారులు ఉన్నారని కాదు. ఎంతమంది వినియోగదారులు సమర్థవంతంగా సైటును ఉపయోగించగలుగుతున్నారన్న ప్రాతిపదికపేనే సోషల్‌నెట్‌వర్క్ మనుగడ ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా కొత్తగా ఇమెయిల్ ఐడి (వెబ్‌చిరునామా) ఏర్పాటు చేసుకున్న వెంటనే ఆయా చిరుమానామా నమోదు చేసిన సైటుకు సంబంధించి సోషల్‌నెట్‌వర్క్ ఖాతా పై మీకు మక్కువ ఉందా? ఉంటే ప్రారంభించండి అంటూ సందేశం కనిపిస్తుంది. ఆదిలో తమకంటూ సోషల్‌నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా సదరు సైటులో ఇప్పటికే నమోదు అయినవారు పరిచయం చేస్తేకానీ సోషల్‌నెట్‌వర్క్‌లోకి సభ్యత్వ లభించేది కాదు. భారదేశంలోని ఎక్కువ మంది వినియోగదారలు ఆర్కుట్‌పై ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అది ఇప్పుడు క్రమంగా ఫేస్‌బుక్‌వైపు వారి చూపులు మరలాయి. సోషల్‌నెట్‌వర్క్ సైట్లు వివాదం అయిన తరువాతనే ప్రచారంలోకి వచ్చాయి. ఆర్కుట్‌లో వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సైటులో తొంగి చూసి స్నేహం చేయడంవల్ల తొలుత ప్రచారం చోటు చేసుకుంది. ఆర్కుట్‌లో స్నేహం చేసినవారిలో ఎక్కువ మంది యువతీ యువకులు వివాహాల వరకు వెళ్ళిన వారు ఉన్నారు. వివాదాలు కొనితెచ్చుకున్నవారు ఉన్నారు. దాపరికంలేకుండా మనసులో మాటచెప్పడమేకాదు కళ్లకు కట్టిట్టు చూపడంవల్ల ఫేస్‌బుక్ ఎక్కువ ఆదరణ చూరగొన్నది. ప్రముఖులు ఫేస్‌బుక్‌లో వెల్లడించిన తమ జీవితరహస్యాల వల్ల ఎందరో వివాదాల పాలు అయిన సందర్భాలు ఉన్నాయి. మనసులో మాట చెప్పాంటే ఇది వేదిక అయింది. ఈ వేదిక మీద చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తాయి. ఆత్మీయుల గుండెతలుపులను తడుతాయి. సోషల్‌నెట్‌వర్క్‌లో చాలా మంది ఖాతా తెరుస్తారు కానీ, అప్‌డేట్ చేయడానికి ముందుకు రారు. ఇలా నిరర్థంగా ఉన్న సోషల్‌నెట్‌వర్క్ చిరునామాలు ఒక్కో సైటులో 60 శాతంపైగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఫేస్‌బుక్, ఆర్కుట్ సోషల్‌నెట్‌వర్క్‌పైన ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అసలు ఈ సైట్లవైపు వినియోగదారులు ఎందుకు మక్కువచూపుతున్నారో పరిశీలిస్తే సులభంగా వెబ్‌పేజీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అన్ని విషయాలు అప్‌డేట్ చేయడంవరకు పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో సైటు డిజైన్, వేగం, రిలవెన్సీ, కొత్త అప్లికేషన్లు, స్నేహితులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఫొటోలు, వీడియోలు, నోటిఫికేషన్లు, చాట్ తదితరాలుకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాధాన్యత ఇచ్చేక్రమంలో ప్రాంతీయ భాషలో వినియోగదారుడు తమ అభిప్రాయం చెప్పగలగడం అగ్రస్థానాన నిలుస్తుంది.